మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కుసుంపురం జనసేన

ఇచ్ఛాపురం, కవిటి మండలం కుసుంపురం గ్రామంలో గాంధీజీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గాంధీ మరియు అమరవీరుల చిత్రపటానికి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. దాసరి రాజు మాట్లాడుతూ మన స్వతంత్రం కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు ఫలితమే ప్రస్తుత ఈ స్వతంత్ర భారతదేశం. కావున స్వతంత్ర సమరయోధులను స్మరిస్తూ వాళ్ల అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయుడు నడుచుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంచిలి జెడ్పీటీసీ అభ్యర్థి ఈశ్వరరావు జనసేన నాయకులు బార్ల ప్రదీప్ మన్మధ, భాస్కర్ రావు, దివాకర్ చలపతి, సిసింద్రీ, శివ సాయి నవీన్, దేవరాజ్, ప్రదీప్, ఉదయ్ జనసైనికులు పాల్గొన్నారు.