ఏప్రిల్ 15వ నుండి “జనసేనకు అవకాశం ఇద్దాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం”

కొత్తపేట, ఏప్రిల్ 15వ తేది నుండి నియోజకవర్గంలో మొదలు కాబోతున్న “జనసేనకు అవకాశం ఇద్దాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం..” కార్యక్రమానికి సంబంధించి క్యాడర్ కు కొత్తపేట నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ బుధవారం దిశానిర్దేశం చేయడం జరిగింది. కొత్తపేట బండారు బుల్లిసత్యం శ్రీమతి చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచారం మొదలు కాబోతుందని, ఇంటింటికి జనసేన పార్టీని తీసుకు వెళ్ళే దిశగా అడుగులు వేస్తు దానికి సంబంధించి క్యాడర్ కు బండారు శ్రీనివాస్ దిశానిర్దేశం చేసారు. ప్రచారానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఒక్కటి నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచేస్తున్న ప్రవాస సింగపూర్ జనసేన పార్టీ సభ్యులు మరియు గ్లోబల్ ఎన్నారై జనసేన పార్టీ సభ్యులు ఏపుగంటి సత్య సాయిరాం, జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల డేవిడ్, సంగీత సుభాష్, బొక్కా ఆదినారాయణ, దొంగా సుబ్బారావు, మండల అధ్యక్షులు చేకూరి కృష్ణం రాజు, తోట స్వామి, సూరపురెడ్డి సత్య, కంఠంశెట్టి చంటి, ప్రోగ్రామ్ కమిటి సభ్యులు, నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.