జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసా పత్రం

నెల్లూరు నగరానికి చెందిన జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లుకి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు చూపించిన నిబద్ధత అభినందనీయమని, పార్టీ కార్యక్రమాల లో ఇటువంటి నిబద్ధతను చూపించి పార్టీని బలోపేతం చేయాలని కొనియాడారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటువంటి ప్రశంసా పత్రం లభించడం భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ కి, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కెకె కి ధన్యవాదాలు తెలియజేశారు.