మూడు రాజధానుల విషయంపై జగన్ సుప్రీంకు లేఖ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఇకపై ఏమాత్రం ఆలస్యం వద్దన్న రీతిలో అడుగులు వేస్తుంది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే.. వాటిపై వెంటనే రాజపత్రాలను జారీ చేసిన జగన్ సర్కారు… కోర్టుల్లో పిటిషన్ల వల్ల కొనసాగుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వికేంద్రీకరణపై హైకోర్టు విధించిన స్టేటస్ కోపై స్టే విధించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రేంకోర్ట్ లో ఇప్పటికే పిటీషన్  వేసింది జగన్ సర్కార్  తాజాగా  సోమవారం లేఖ కూడా వ్రాసింది. మూడు రాజధానుల విషయంలో ఎంత మాత్రం జాప్యం చూడరాదని ఆ లేఖ లో సుప్రీమ్ ను జగన్ సర్కార్ కోరింది.