తక్షణమే గ్రంథాలయాన్ని విద్యార్థులకు అప్పజెప్పాలి: బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి వైసిపి సర్కార్ కి ఇదే చివరి వార్నింగ్ బొబ్బిలి గ్రంథాలయం పనులు తక్షణమే మొదలుపెట్టి జనవరి 24వ తేదీలోపు పనులు పూర్తి చేసి మళ్లీ గ్రంథాలయం విద్యార్థులకు అప్పజెప్పాలి. లేకుంటే, విద్యార్థుల తరపున జనసేన పార్టీ నిరాహార దీక్ష చేపడుతుందని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు హెచ్చరించారు. బాబు పాలూరు ఆదివారం మీడియా ముఖంగా మాట్లాడుతూ గ్రంథాలయం భవనం నుంచి విద్యార్థులను ఖాళీ చేయిపించి, 2 వారాల్లో పనులు పూర్తి చేసి తిరిగి అప్పజెప్తామని చెప్పి ఇన్ని నెలలు గడుస్తున్నా, ఇసుమంత పని కూడా చెయ్యలేకపోవడం.. ఇది మీ నిర్లక్ష్యమా? లేక చేతకానితనమా?.. బొబ్బిలి ఎమ్మెల్యే మరియు మున్సిపల్ కమిషనర్ తక్షణమే భాధ్యత వహించి, జనవరి 24లోపు మరమ్మత్తులు పూర్తి చేసి, అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని బొబ్బిలి విద్యార్థులు, పాఠకులకు అందజేయాలని బాబు పాలూరు కోరారు.