అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన లింగంపాలెం జనసేన

చింతలపూడి, లింగపాలెం మండలం, విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అరచితంగా వ్యవహరించిన వైసిపి ప్రభుత్వం విధానానికి నిరసనగా సోమవారం లింగపాలెం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు మాట్లాడుతూ జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దాడులు, అరెస్టులు చేయడం, పోలీసుల చేత పవన్ కళ్యాణ్ ని అణచివేయాలని చూస్తే రాష్ట్రంలోని కార్యకర్తలు తిరుగుబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ అధ్యక్షులు మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, బంటు సామ్యూల్, పఠాన్ సుభాని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.