పలుకుటుంబాలను పరామర్శించిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి పూసపాటిరేగ మండలంలోని, లంకలపల్లిపాలెం గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరకులు అందించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. అలానే డెంకాడ మండలం, డి.ముంగినపల్లి పంచాయతీకి చెందిన రెండు కుటుంబాలు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో బోల్తా పడి బలమైన గాయాలయ్యయన్న విషయం తెలుసుకొని, శనివారం వారిని కలసి ఆసరాగా చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది, పూసపాటిరేగ మండలం పెరా పురంకి చెందిన జనసైనికుడు ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో మరణించడం వలన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మేము ఉన్నాం అని వాళ్ళ అమ్మ గారికి భరోసా కల్పించి, ఆ కుటుంబానికి నగదు సాయం అందించటం జరిగింది. ఆ మార్గం మధ్యలో పయనిస్తున్న వారితో కలసి మాట్లాడిన మాధవి కరువు పని చేసుకుంటున్న వారితో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఈ ప్రభుత్వం మరియు గత ప్రభుత్వ పాలకులు తమని పూర్తిగా విస్మరించారు అని వారు వాపోయారు, తమ బిడ్డలకి ఉపాధి అవకాశలు దొరకట్లేదు అని తెలియచేసారు, అలానే లంకపల్లిలో రైతులతో మాట్లాడిన మాధవి వారి సమస్యలు విని వారికి పంట పొలాలకి రావాల్సిన నీరు పూర్తిగా చంప నది ద్వారా వ్యర్థం అవుతుంది అని, రామతీర్ధం ప్రాజెక్ట్ లు పూర్తి కాకనే ప్రజలు ఈ అవస్థలు పడుతున్నారు అని ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దే దించాలి అని పిలుపునిచ్చారు.