ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆర్ధిక సాయమందించిన మచిలీపట్నం జనసేన

మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 50వ డివిజన్ గోపాల్ నగర్ కు చెందిన బొడ్డాడ సాయి ఇటీవల ప్రమాదానికి గురై ఎడమ చేయి పూర్తిగా నలిగిపోయి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిని డాక్టర్లు తెలపడంతో వెండి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సాయి ఆర్థిక పరిస్థితి 50 వ డివిజన్ జనసైనికులను కదిలించింది. 50వ డివిజన్ జనసైనికుల ఆర్థిక సహకారానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ మరికొంత నగదును జోడించి డివిజన్ జనసైనికుల సమక్షంలో ఇన్చార్జి బండి రామకృష్ణ బాధితుడు సాయికు 25వేల రూపాయల నగదును అందజేశారు. ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సంతృప్తి ఉందని తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమానికి కులమత పార్టీ బేధం లేకుండా వినియోగిస్తున్నానని 50వ డివిజన్ జనసైనికులు ఐక్యంగా ఉంటూ ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని బండి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డివిజన్ ఇంచార్జ్ రామినాయుడు, వడ్డీ చిరంజీవి, తోట రాజేష్, వివేక్, వేముల చక్రి, నరసింహ, మైకేల్ మరియు 50వ డివిజన్ జనసైనికులు పాల్గొన్నారు.