విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి జనసేన పూర్తి మద్దతు: డా.పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి తిరుపతి పట్టణంలో టిఎమార్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, జనసేన పార్టీ తరుపున రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ తో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతు తెలిపారు. డా.పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గతంలో విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారనీ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు సాధించుకునే వరకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.