“మహా రక్తదాన శిబిరం” జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కరపత్రాల పంపిణీ

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 29న, రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామంలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే “మహా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీని, మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, ప్రత్తిపాడు ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, పిఠాపురం ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారి, కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు, కాకినాడ సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ మరియు ఇతర ముఖ్య నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేసి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, కర్రి దొరబాబు, తోరాటి శ్రీను, మట్ట వెంకటేశ్వరరావు, నాతిపాం దొరబాబు, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, ఇవూరి శ్రీనివాస్, చిట్టిప్రోలు సత్తిబాబు, బోయిడి వెంకటేష్, మన్యం శ్రీను, పడాల అనీష్, కమిడి సత్తిబాబు, పొలారావు, డి.ఎం.ఎస్ న్యూస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.