శంఖారావం సభను విజయవంతం చేయండి: జనసేన-టిడిపి నాయకులు

గంగాధర్ నెల్లూరు, శంఖారావం సభను విజయవంతం చేయాలని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో శనివారం ఎస్ఆర్ పురం మండలం క్షీరసముద్రం వద్ద నారా లోకేష్ శంఖారావం సభ స్థలాన్ని జనసేన టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 10వ తేదీన ఎన్నికల శంఖారావం సభకు టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ వస్తున్నారు కావున గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. అలాగే సభ ఏర్పాటు స్థలాలను చుట్టూ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.