జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: కనపర్తి మనోజ్ కుమార్

  • చలో మచిలీపట్నం..
  • జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం
  • పొన్నలూరు మండలం నుండి అత్యధిక సంఖ్యలో వెళ్తున్న జనసైనికులు
  • అతిత్వరలో పొన్నలూరు మండలంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

పొన్నలూరు: జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపి నియోజకవర్గంలో ఆరు మండలాల నుండి భారీ సంఖ్యలో మచిలీపట్నంకి జనసైనికులు చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పొన్నలూరు మండలం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో మచిలీపట్నంకి తరలి వెళ్లడం జరుగుతుంది. ఇప్పటివరకు పొన్నలూరు మండలం నుండి ఎవరు ఊహించని స్థాయిలో జనసైనికులు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. అతిత్వరలో పొన్నలూరు మండలంలో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉంటాయి, కావున ప్రతి ఒక్కరూ చలో మచిలీపట్నం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.