జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి

పాడేరు: జి.మాడుగుల మండల జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పాడేరులో జరిగే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మన మండలం నుండి పార్టీ తరుపున భారీగా పాల్గొని విజయవంతం చెయ్యాలని మండల నాయకులకు జి. మాడుగుల మండల అధ్యక్షుడు మసాడి భీమన్న దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సాగెని ఈశ్వర రావు గౌరవ అధ్యక్షుడు టి.వి రమణ సీనియర్ నాయకుడు మసాడి సింహాచలం, బూత్ కన్వీనరు టి.త్రిమూర్తి, పి.అర్జున్ వీరమహిళ జి.పార్వతమ్మ, కే. నాగేశ్వరావు, మాధుల, సోమన్న గబ్బాడి నాగేశ్వరావు, రాజు పార్టీ నాయకులు పాల్గొవడం జరిగింది.