నాదెండ్ల పర్యటన విజయవంతం చెయ్యండి!: పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనల సందర్భంగా.. శ్రీకాకుళంలో నియోజకవర్గస్థాయిలో విస్తృత సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల నేపధ్యంలో పాలకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం 3గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా, అరసవిల్లి రోడ్ జంక్షన్, హోటల్ సన్ రైజ్ బిసైడ్ ఇందిరా విజ్ఞాన భవన్ నందు ఏర్పాటు చేసిన సభకు పాలకొండ నియోజకవర్గం జనసైనికులు హాజరై, పార్టీలో కొత్తగా చేరాలి అనుకునేవారిని చేర్పించే విధంగా ప్రతీ జనసైనికులు, నాయుకులు కృషి చేసి, నాదెండ్ల మనోహర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని పాలకొండ జనసేన నాయుకులు వేణు, జనసేన జానీ, కర్రి కళ్యాణి, జరాజపు రాజు, రఘుమండల గణేష్, అనిల్, జయశంకర్, సందీప్, సతీష్, దుర్గాప్రసాద్ తెలియజేసారు.