మంగళగిరి నియోజకవర్గ జనసేన యువజన విభాగం నియామకం

  • నేటి యువతే రేపటి భవిష్యత్తు – జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదంతో మంగళగిరి టౌన్, మంగళగిరి మండలం, తాడేపల్లి టౌన్, తాడేపల్లి మండలాలకి జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతనంగా నియమితులైన యువజన అధ్యక్షులకు నియామక పత్రాలు అందించడం జరిగింది. నూతనంగా యువజన విభాగం అధ్యక్షులుగా మంగళగిరి టౌన్: షేక్ కైరుల్లా, మంగళగిరి మండలం: బలుసుపాటి వెంకటేశ్వరరావు, తాడేపల్లి టౌన్: సింగంశెట్టి వెంకటేశ్వరరావు, తాడేపల్లి మండలం: తిరుమలశెట్టి నరసింహారావు నియమితులైనారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా నియమితులైన యువజన విభాగం అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మన పార్టీలో ఉన్నంత యువత వేరే ఏ పార్టీలోనూ లేరని, నేటి యువతే రేపటి భవిష్యత్తు అని, పార్టీ నియమనిబంధనలకు లోబడి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసి రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవిధంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్ర, ఎంటిఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు (ఎస్.ఎన్.ఆర్), తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీధర్, తాడేపల్లి మండల కార్యదర్శి ఇండ్ల జగదీష్, ఇప్పటం గ్రామ కమిటీ సభ్యులు, ఉండవల్లి గ్రామ జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.