శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల్లో పాల్గొన్న మేడ గురుదత్

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాల్లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ కి ఆలయ కమిటీ వారు శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, బదిరెడ్డి దొర, తొరటి దుర్గా ప్రసాద్, ఆకుల ఆదిత్య, కొచ్చర్ల బాబి, పెమ్మాడ సతీష్, పోసిబాబు, రచపోతుల సురేష్, కోరుకొండ మండల నాయకులు తన్నీరు తాతాజీ, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, పల్లా హేమంత్ తదితరులు పాల్గొన్నారు.