జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరిన పలు కుటుంబాలు

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని బోగసముద్రం(బుగ్గ) గ్రామానికికు చెందిన కుటుంబాలు తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీలో చేరడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం నుంచి చాలామంది పార్టీలో చేరబోతున్నారని రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పార్టీ బలోపేతంనకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలో పవన్ కళ్యాణ్ తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తారని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కిరణ్, అయూబ్, దిలీప్, సుదర్శన్, మణికంఠ, రసూల్, రాహుల్, చిన్నా పాల్గొన్నారు.