పల్లె-పల్లెకు జనసేన కు శ్రీకారం చుట్టిన మర్రాపు సురేష్

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, కొత్త శ్రీరంగ రాజపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మర్రాపు సురేష్ పల్లె పల్లెకు జనసేన కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు.

కార్యక్రమంలో భాగంగా.. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలతో కూడియున్న కరపత్రాలతో పాటు, జనసేన అధినేత ప్రజలకు తలపెట్టిన రైతు భరోసా, ప్రజలకు, జనసైనికులకు మేలుచేసే కార్యక్రమాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలతో కూడియున్న కరపత్రాలను ఇంటిఇంటికి ఇచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు.

గజపతి నగరం నియోజకవర్గంలో ప్రతీగ్రామానికి వెళ్లి ఇంటిఇంటికి జనసేన ఆశయాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని తీసుకెళ్లటమే పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం ముఖ్యద్దేశ్యమని తెలిపారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, పండు, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ, హరీష్ నాని, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.