జనసేనలో మైనార్టీ యువకుల భారీ చేరిక

నెల్లూరు: నగరంలోని స్థానిక జనసేన కార్యాలయం నందు స్థానిక జండా వీధికి చెందిన యువత సుమారు 200 మంది జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు నగర ప్రధాన కార్యదర్శిగా కంతర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి పార్టీ పరంగా అవకాశాలు లభించేటట్ట్లు ప్రయత్నిస్తామని, ఈ కార్యక్రమాన్ని జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలియా, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.