వైస్సార్సీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు

  • సీతానగరం గ్రామంలో 100 మంది జనసేనలో చేరిక

సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో 2019లో వైస్సార్సీపీ పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర వహించిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు కోట రాజా గారి ఆధ్వర్యంలో 100 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి, రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చేస్తున్న సేవ కార్యక్రమాలు, నిత్యం ప్రజా క్షేమం కోసం పాటుపడే తత్వం నచ్చి వారి సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాజానగరం నియోజకవర్గం యువజన నాయకులు తోట పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.