జనసేన పార్టీలో భారీ చేరికలు

రంపచోడవరం: అడ్డతీగల మండలం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైసీపీ నుంచి కుర్ల రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం వీధి రోడ్లు లేవు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత మాకు మేలు జరుగుద్దని ఆశిస్తూ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, అంజి, మణికంఠ, అప్పాజీ, వెంకటేష్, రాజ్ కుమార్, రాంప్రసాద్, వీరబాబు, సాయి కృష్ణ, గంగవరం మండలం సీనియర్ నాయకులు గణేష్, రాజేష్ చంద్రశేఖర్, మరియు సీనియర్ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.