అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యం: తంబళ్ళపల్లి రమాదేవి

తిరుపతి: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయి దళిత గిరిజన రాజకీయ పార్టీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లా జనసేన పార్టీ తరపున శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొని ప్రసంగిస్తూ, వైసీపీ ప్రభుత్వం దళితుల యొక్క నిధులను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దళితులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం అందుతుందని ప్రసంగించారు.