నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం జిల్లా కి సంబందించిన పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, చిట్టీపూడివలస గ్రామంలో వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన చిట్టిపూడి వలస గ్రామ సర్పంచ్ కుప్పిలి పాపమ్మ, ఎంపీటీసీ గుంట్రెడ్డి విశాలాక్షి, గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులుకి సంబందించిన 400 కుటుంబాలు ఉమ్మడి పార్టీల బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి పార్టీ విధానాలు నచ్చక ప్రభుత్వం అసమర్థత పాలన చూసి స్థానిక యం యల్ ఏ తీరు పైన విసిగి చెంది జనసేన పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టిపూడి వలస వైసీపీ నాయకులు గుంట్రెడ్డి చంద్రశేఖర్, గుంట్రెడ్డి హరికృష్ణ(బజ్జి), గుంట్రేడ్డి సూర్యనారాయణ స్వామి, పూడి సింహాచలం, దార్వపురెడ్డి శ్రీరామ్ మూర్తి, మరిసిర్ల సత్యం నాయుడు, బొంతాడ గగ్గునాయుడు, రెడ్డి సూర్యనారాయణ, చిగురుకోట సీతారాములు, జక్కు సింహాచలం, కుమిలి లక్ష్మీనాయుడు, కుప్పిలి తౌడు, భవిరి ఆరోగ్యం, భవిరి రుపవతి, కుప్పిలి గణపతి, భవిరి రాజు, కుప్పిలి శ్రీనివాస్ రావు మరియు గ్రామ పెద్దలు జయక్రిష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ జిల్లా కార్యదర్శి బి పి నాయుడు, వీరఘట్టం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్, మాజీ జడ్పిటిసి గేదెల రమేష్ బాబు, మాచర్ల అనిల్ బాబు జనసేన క్రియశీలక వాలంటీర్స్ మత్స పుండరీకం, రౌతు గోపి మజ్జి శ్రీను మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన యం యల్ ఏ అభ్యర్థి జయకృష్ణ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం అని గ్రామ ప్రజలు ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *