గంగంపేట గిరిజన గ్రామంలో పర్యటించిన మత్స పుండరీకం

పాలకొండ, గిరిసేన – జనసేన కార్యక్రమంలో భాగంగా మంగళవారం గంగంపేట గిరిజన గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో మొదటి విడత గా విజయవాడలో జరిగింది. జనవాణి ద్వారా ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకునే విధానం, సమస్యల పట్ల స్పందిస్తున్న పద్ధతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రజలకు జనసేన భరోసా నిలుస్తోందని మత్స పుండరీకం అన్నారు. ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడంలో పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవ భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇలాంటి నాయకుడికి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు మార్చుతారని దృఢవిశ్వాసంతో గిరిజన ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గెలిచే వరకు ముద్దులు పెట్టి గెలిచినాక పన్నులతో గుద్దేసి బస్సు ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి మూడేళ్ల పాలనలో మాలాంటి వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నడు అని గిరిజనప్రజలు అంటు, తమ ప్రధాన సమస్యలు వివరించారు.

అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ…
ప్రజల కోసం పోరాడుతు, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దామని అన్నారు. ఒక వ్యక్తిలో ఉండే నిజాయితీ, నిస్వార్థం, నిబద్ధత, సమాజసేవ పట్ల అంకిత భావం వల్ల కోట్లాదిమంది వ్యక్తులు ఆ వ్యక్తిని ఆరాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నత మానవతామూర్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆత్మహత్య చేసుకున్న మూడు వేలమంది కౌలురైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని పంచుతున్నారు. ఈరోజు కోట్లాదిమంది అతనికి అండగా నిలబడతున్నారు. రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడం ఖాయం – జనసేన విజయకేతనం తథ్యం అని మత్స పుండరీకం అన్నారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు బిడ్డిక వినోద్, నవనీత్, బి.పి.నాయుడు, కర్ణేన సాయి పవన్, వావిలపల్లి నాగభూషన్, అన్ను రామకృష్ణ, గుమ్మడి సుధాకర్, కంటు మురళి తదితరులు పాల్గొన్నారు.