గిరిసేన – జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మత్స పుండరీకం

*గిరిజన గ్రామాల్లో పర్యటించిన మత్స పుండరీకం

*కుంబిడి గ్రామంలో గిరిసేన – జనసేన కార్యక్రమానికి శ్రీకారం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కుంబిడి గ్రామంలో శుక్రవారం వాలంటీర్ మత్స పుండరీకం గిరిసేన – జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా.. గిరిజన ప్రజలను కలిసిన మత్స పుండరీకం మాట్లాడుతూ.. జనసేన- జనవాణి, రైతు భరోసా యాత్ర, జనసేన పార్టీ మేనిఫెస్టో, క్రియాశీలక సభ్యత్వం గురించి మహిళకు, యువతకు, పెద్దలకు, వివరించారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో ద్వారా ప్రజల దగ్గరకు వెళ్ళి గ్రామంలోని ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన
జనసేన – జనవాణి ద్వారా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మీ గ్రామ పంచాయతీ నుండి పవన్ కళ్యాణ్ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు ఒకరురావలని మత్స పుండరీకం కోరారు. కుంబిడి గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి వివరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు చనిపోయారని.. వారి కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్నారని. ఇప్పటికి నాలుగు జిల్లాలో పూర్తి చేసారని తెలియజేసి.. ఇటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మత్స పుండరీకం కోరారు. జనసేన పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించి.. ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

ఈ సందర్భంగా కుంబిడి గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా కొండల్లో జీవిస్తున్న మాకు, మా ఊరి సమస్యలగురించి తెలుసుకోడానికి వచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మత్స పుండరీకంతో అన్నారు. గ్రామ ప్రజలలో జనసేన పార్టీ పట్ల అపూర్వమైన ఆదరణ ఉందని మత్స పుండరీకం అన్నారు.
ఈ కార్యక్రమంలో కుంబిడి గ్రామ జనసైనికులు వినోద్, నవనీత్, రమేష్, బి పి నాయుడు, కంటు రాంబాబు, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.