గాంధీ మహాత్మునికి నివాళులర్పించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం: అహింసా వాదంతో ఎంత కఠినమైన లక్షణాన్ని అయినా చేదించవచ్చని నిరూపించి.. వలస వాదుల చెరనుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి.. ప్రపంచానికి నూతన పోరాట వడవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో గాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల సీనియర్ నాయకులు అడపా అంజి బాబు, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు, కోరుకొండ మండలం కార్యదర్శి పోసిబాబు, చల్లా ప్రసాద్ కోటికేశవరం జనసేన పార్టీ నాయకులు పొట్నూరి అప్పన్న, జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీగా పోటీచేసిన పొట్నూరి అచ్చియమ్మ, ది. హరి, డి.ఎం. రాజు, డి. పోతిరాజు, పి. ఆకాష్, ఎస్. దుర్గా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.