జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
రాజమండ్రి 29 వార్డు ప్రజలకు కొత్తపేట కొబ్బరికాయల మార్కెట్ ఎదుట జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన నాయకులు సురేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో మెడికల్ క్యాంపులో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, నగర కమిటీ సభ్యులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.