మార్కాపురం జిల్లా సాధనకై జేఏసీ నాయకుల సమావేశం

మార్కాపురం జిల్లా చేయాలని కోరుతూ జేఏసి ఆధ్వర్యంలో కనిగిరి ఉగ్ర నరసింహరెడ్డి కార్యాలయం నందు జేఎసి వైస్ ఛైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశ ప్రాంతం మార్కాపురం యొక్క అభివృద్ధి సాధనకై ప్రతి ఒక్కరు తమ చాయ శక్తుల తోడ్పడి జిల్లా సాధించుకుందామని, ఇప్పుడు జిల్లా సాధించుకోకపొతే రానున్న రోజుల్లో జిల్లా సాధించుకొలేమని, మార్కాపురం జిల్లా చేయాలని చేస్తున్న నిరహారదీక్షలు కొంతమంది నాయకులు అడ్డుకున్న ఇంకా మరెన్నో ఉద్యమాలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎసి చైర్మన్ కందుల నారాయణరెడ్డి , జేఏసీ కన్వీనర్ షేక్ సైదా, జేఎసి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి ఏరిక్షన్ బాబు, జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్, సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య జిల్లా యొక్క ఆవశ్యతను వివరించారు. కనిగిరి జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి రహిముల్లా, జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కదిరి భవాని, జిల్లా సాధన సమితి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.