హోమ్ సోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన మెగాస్టార్!

ఎన్టీఆర్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాను కరోనా బారిన పడిన విషయాన్నీ స్వయముగా ఎన్టీఆర్ అభిమానులకు తెలియజేసాడు. ప్రస్తుతం హోమ్ సోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ కు చిరంజీవి ఫోన్ చేసి తన ఆరోగ్యం ఫై ఆరా తీశారు. ఈ విషయాన్నీ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. ‘ కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.