చిరంజీవి సినిమాలో అతిథి పాత్రకు ఓకే చెప్పిన మిల్కీ బ్యూటీ తమన్నా

మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’.  హీరోయిన్‌గా కాజల్‌‌ అగర్వాల్‌ నటిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా పేరును ప్రకటించినప్పటి నుండి  చిరు సినిమాలో పలువురు అగ్ర  హీరోయిన్లు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర కోసం మొదట దర్శక నిర్మాతలు కీర్తి సురేష్‌ పేరును అనుకున్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా తమన్నా పేరును ఖరారు చేశారంట. ఇటీవల తమన్నాకు వీడియో కాల్‌ ద్వారా దర్శకుడు పాత్రను వివరించగా వెంటనే మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మెగాస్టార్‌ 152వ సినిమా ‘ఆచార్య’కు స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించగా కరోనా కారణంగా వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభంకానుంది.