మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే: ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ

హైదరాబాద్‌: మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్ అనే టైటిల్‌తో సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన పాటల సీడీని హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. పాటను మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 44 కిలోలతో తయారు చేసిన కేక్‌ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ తదితరులు తలసాని సాయికిరణ్ యాదవ్‌లతో కలిసి కట్ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి తలసాని

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం మంత్రి తలసాని దివ్యాంగుడికి ట్రైస్కూటర్‌ను అందజేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సైతం మంత్రి ప్రారంభించారు.