ఆర్జేడీ కూటమిపై మోడీ విమర్శలు

ఆర్జేడీ కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ నేతలు బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ-జేడీయూ-వీఐపీ-హెచ్ఏఎం కూటమిని గెలిపించాలని కోరారు. పేదల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ఆర్జేడీ నేతలు స్వార్థం కోసం వినియోగించుకున్నారన్నారు. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే, ఆటవిక పాలన తిరిగి వస్తుందని హెచ్చరించారు. పేదల గురించి, ప్రజల గురించి ఆర్జేడీ నేతలు పట్టించుకోరని చెప్పారు. వాళ్ళు పట్టించుకుంటే బిహార్ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉండేది కాదని మోడీ అన్నారు.