వారాహి యాత్ర విజయవంతం కావాలని మోపిదేవి జనసేన ప్రత్యేక పూజలు
అవనిగడ్డ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మోపిదేవి మండల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ ఆధ్యర్యంలో శ్రీ స్వామి వారికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, పార్టీ న్యాయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, నియోజకవర్గ నాయకులు బచ్చు వెంకట్నాథ్, సిద్దినేని అశోక్ నాయుడు, మోపిదేవి మండల పార్టీ ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్, భోగిరెడ్డి సాంబశివరావు, వీరమహిళ కేతరాజు హిమనాగ శ్రీవల్లి, మండల నాయకులు బాదర్ల లోలాక్ష నాయుడు, కలపాల ప్రసాద్, యర్రంశెట్టి సునీల్, కేతరాజు రామకృష్ణ, రేపల్లె నాగేంద్ర బాబు, జనసైనికులు తోట శ్రీనివాస్, చావకుల సురేష్, కోసూరు అన్వేష్ బాబు, రాఘవ కూరేటి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.