చలో నరసాపురం, మత్స్యకార అభ్యున్నతి సభకు తరలిరండి

రాష్ట్ర ఆదాయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. మత్స్యకారులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు మత్స్యకారుల స్థితిగతులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనెల 20వ తేదీన నరసాపురంలో జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార అభ్యున్నతి సభ బొమ్మిడి నాయకర్ గారి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. కావున మత్స్యకార సోదరులు, సోదరీమణులు, వీర మహిళలు, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, నియోజవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. శనివారం కృత్తివెన్ను మండలంలో మత్స్యకార అభ్యున్నతి సభ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట, జనసేన మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి ఒడగు రాజు, జిల్లా కార్యదర్శి, తిరుమల శెట్టి చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి కూనసాని నాగబాబు, కుర్తి వెన్ను మండల అధ్యక్షుడు తిరుమని రామాంజనేయులు, బంటుమిల్లి మండల అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ, పుప్పల పాండురంగారావు, పాశం నాగమల్లేశ్వరరావు, పుప్పాల సూర్యనారాయణ, కొప్పినెటి నరేష్, శివమణి, బాడిత నాగబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.