నంద్యాల సుబ్బలక్ష్మికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, కొండ గుంటూరు గ్రామస్తులు నంద్యాల వెంకన్న సతీమణి నంద్యాల సుబ్బలక్ష్మి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొండ గుంటూరు జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కొండ గుంటూరులోని వెంకన్న స్వగృహానికి వెళ్లి సుబ్బలక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం జనసైనికుల చేతుల మీదుగా 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంకటలక్ష్మి అందించారు. వీరితో అడ్డాల దొర, అరిగెల రామకృష్ణ, కొప్పిరెడ్డి బాబి, పాటంశెట్టి శివ, జగతా వీరభద్రరావు, అగర్తి రజినికాంత్, బుడ్డిగ ప్రసాద్, అరవ కోటి, ఈవూరి శ్రీను, అరవ లక్ష్మణ్ తదితరులతో పాటు కొండ గుంటూరు జనసైనికులు పాల్గొన్నారు.