అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, చిన్న కొండేపూడి గ్రామంలో చిడిపి మురళి తాటాకు ఇళ్లు ఫైర్ యాక్సిడెంట్లో పూర్తి కాలిపోవడంతో స్థానిక ఎన్.డి.ఏ నేతల ద్వారా విషయం తెలుసుకుని హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ మహిళా సాధికారత కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన – తెలుగుదేశం – బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.