శ్రీకాళహస్తి ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి!

  • జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధి, జెట్టి పాలెం, నెహ్రూ స్ట్రీట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ కి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ కి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.