శ్రీరంగపట్నంలో పలు కుటుంబాలకు శ్రీమతి బత్తుల పరామర్శ

రాజానగరం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీర్రాజు తండ్రి గారైన శీలంశెట్టి వెంకట్రావు ఇటీవల స్వర్గస్తులైనారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన సూరిశెట్టి వెంకట్రావు కుమారుడు సూరిశెట్టి రమేష్ ఇటీవల స్వర్గస్తులైనారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తన్నీరు తాతాజీ, దొడ్డి అప్పలరాజు, మద్దాల గంగాధర్, త్రినాధ్, జనసైనికులు పాల్గొన్నారు.