విద్యుత్ ఘాతానికి మరణించిన బాలుడి కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, గురజ గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించిన 12 సంవత్సరాలు బాలుడి తల్లి తండ్రులను పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు మీ కుటుంబానికి ప్రభుత్వం వారి నుండి రావలసిన నష్టపరిహారాన్నీ పొందడంలో కూడా మేము అండగా నిలబడి మా వంతు సాయం మేము చేస్తామని.. ముదినేపల్లి మండలం జనసేన నాయకులు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వదం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణా, మోటేపల్లి హనుమ ప్రసాద్, బాసిమ్ శెట్టి కిషోర్, మండల ఉప అధ్యక్షులు వర్రే హనుమాన్ ప్రసాద్, ఎర్రంశెట్టి శివప్రసాద్, మండల కార్యవర్గ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.