భారీ జనసందోహంతో ముమ్మారెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్, పర్వత్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక, శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవాలయం సందర్శించి, ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని, బిజెపి బలపరిచిన జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శుక్రవారం పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అల్లాపూర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి బలపరిచిన జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ భారీ జన సందోహం మధ్య పాదయాత్రను ప్రారంభించి ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. మసీద్ గల్లి, గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ విగ్రహం, గాయత్రీ నగర్, లక్ష్మీ నగర్, తులసి నగర్, వివేకానంద నగర్ వరకు పాదయాత్ర కొనసాగించారు.ఆనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లో చుట్టూ ఉన్న చెరువులన్నీ కబ్జా జరిగాయి. ఈ సారి కబ్జాదారుల ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో కొనసాగడం అంటే అంతా సులభమైన విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు ధన, కుల, మతాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో యువత మేలుకోవాలని సూచించారు. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్. ఇరువురు గొప్ప దేశభక్తులని, నిజాయితీ గల నాయకులు, వారి సారథ్యంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో యువతలో చైతన్యం కలిగి ఖచ్చితంగా బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాకు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, గాజు గ్లాసు మీద ఓటు వేసి మీ దేశ భక్తిని చాటుకుంటారని, యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు విజయ్, పులిగోల్ల శ్రీనివాస్, అల్లాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ లక్ష్మి, డివిజన్ నాయకులు, రాజేష్, కొల్లా శంకర్, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.