నెల్లూరులో జనసేనలో చేరిన ముస్లిం సోదరులు

నెల్లూరు నగరం, స్థానిక జెండావీధి నుంచి ముస్లిం సోదరులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మరియు సుజయ్ బాబు మాట్లాడుతూ.. నెల్లూరు నగర అభివృద్ధిని మరుగున పెట్టి, ప్రజల సంక్షేమాన్ని పక్కకు నెట్టి అధికార కాంక్షతో అధ్యక్షుణ్ణి ప్రసన్నం చేసే పనిలో వైసీపీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. ఆధిపత్యపోరు తో కళ్ళు మూసుకొని పోయి బహిరంగ అహంకార ప్రదర్శనలు సంబరాలలో బిజీగా ఉండి.. ప్రజల కష్టాలతో సంబంధం లేకుండా వేడుకలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. నెల్లూరు నగరం ప్రధాన కూడలి అయిన జండా వీధి నుంచి ముస్లిం సోదరులు పార్టీలో చేరడం సంతోషకరంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ సిధ్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను నెల్లూరు నగరంలోని ప్రతి గడపకు చేరే విధంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలీ, అల్లు, అక్బర్ మరియు నజీర్ వారి పరివారం అందరికీ వారు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వనించారు.