ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటీ, 21వ వార్డులో మోయిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్, కాకినాడ సిటీ జనసేన ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ పాల్గొన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైస్ ప్రెసిడెంట్ ఒలేటి రాము జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.