‘నా సేన కోసం నా వంతు’ బాల్యం రాజేష్ రూపాయలు 11000/- విరాళం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ జనసేన పార్టీకి తన వంతు బాధ్యతగా “నా సేన కోసం నా వంతు” మొదటిగా 1000 రూపాయలు, రెండవసారి 10,000 రూపాయలు ( మొత్తం 11 వేల రూపాయలు ) జనసేన పార్టీకి విరాళం పంపించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీని నడపాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని తన కోసం ఉపయోగించుకోకుండా జనసేన పార్టీకే ఖర్చు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని, అలాగే ప్రజా సమస్యలు పోరాటం కోసం చేస్తున్న జనవాని మొదలైన కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అని జనసేన పార్టీ ఆర్థిక వృష్టి సాధించడం ద్వారా మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సమాజ సేవ చేసే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉంటుంది అని తెలుసుకొని మొత్తం 11,000 రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం జరిగింది. మరింత మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ జనసేన పార్టీ భూతిపరులు ఈ 7288040505 నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే పేటీఎం, ద్వారా పార్టీకి విరాళాలు అందించాలని తెలియజేశారు.