పాయకరావుపేటలో ‘నా సేన కోసం నా వంతు’

పాయకరావుపేట నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించి పార్టీలో భాగస్వాములవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట జనసేన పార్టీ నియోజకవర్గ జనసేన నాయకులు శివదత్ బోడపాటి కోరడం జరిగింది. పార్టీని బలోపేతం చేయడం ద్వారా జనసేన అధినేత ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.