గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు ‘

  • మదనపల్లె నియోజకవర్గంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా జనసేన పార్టీలో ప్రజల భాగస్వామ్యం

మదనపల్లె, ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రాజకీయలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన రావడానికి క్రౌడ్ ఫండింగ్ కి నాంది పలికారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమానులతో నా సేన కోసం నా వంతు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ రాజకీయాలలో పెను మార్పులు ఆశీస్తూ తాను నమ్మిన సిద్దాంతం, భావజాలాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఎప్పటికప్పుడు నూతన పంత ఎంచుకోవడంలో జనసేనాని రాజకీయ పరిణితికి నిదర్శనం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత క్రౌడ్ ఫండింగ్ అనేది అందరిని కలిపి నిర్ణిత లక్ష్యాన్ని అందుకునే ఆర్థిక మంత్రం అని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, జగదీష్, తోట కల్యాణ్, నవీన్ రెద్దమ్మ కొల నాగవేణి, మండల పార్టీ అధ్యాక్షులు గ్రానైట్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ శక్తి జంగాల రామసముధ్రం చంద్రశేఖర్, క్రాంతి, లక్ష్మీపతి జాయింట్ సెక్రటరి సనఉల్లా గజ్జెల రెడ్డప్ప పాల్గొన్నారు.