నడుకుదురు గ్రామ కమిటీ సమావేశం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అభివృద్ధి, నిర్మాణం, గ్రామ సమస్యలపై అవగాహన, ప్రభుత్వ పనితీరు తదితర అంశాలపై గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా.. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామ కమిటీ వారితో కాకినాడ.. గొడరిగుంట పంతం నానాజీ స్వగృహం వద్ద గ్రామ కమిటీ అధ్యక్షులు బిరుద భాస్కర్ తమ్మయ్య అధ్యక్షతన గ్రామ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముందుగా, సభ్యులు అందరికి అల్పాహారం అందించిన తరువాత నూతన గ్రామ కమిటీ సభ్యులకు, దుస్సాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపి, వారికీ దిశా నిర్దేశం చేసి, ప్రతి గ్రామ కమిటీ సభ్యులు తమ ఇంటిపై జనసేన జండా ఎగురవేయాలని, పార్టీ ని మరింత బలోపేతం చేయాలనీ,పార్టీ సిద్ధాంతాలను, పవన్కళ్యాణ్ గారు చేపట్టిన ప్రజహిత కార్యక్రమాలను గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలియచేయాలనీ, అలానే వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలనీ, నా వద్దకి వచ్చిన వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని, తెలిపిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో కరప మండలం అధ్యక్షులు బండారు మురళి,రాష్ట్ర సహాయ కార్యదర్శి బోగిరెడ్డి గంగాధర్, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, సింగంపల్లి స్వామి, శివన్నారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.