మీడియాపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాం: నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్ లో శుక్రవారం ఏ.బి.ఎన్ మరియు హెచ్.ఎం.టీవీ ఛానల్స్ వాహనాలు, సిబ్బందిపై కడప ఎంపీ వైఎస్.అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయటాన్ని జనసేన పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నడిబొడ్డున మీడియా మీద దాడి జరిగిందంటే ప్రజాస్వామ్యం మీద జరిగినట్లే. కనుక తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవలసినదిగా తెలియజేశారు.