జనసైనికుడిలా పనిచేస్తా: నిమ్మల నిబ్రమ్

  • ఘనంగా నిమ్మల నిబ్రమ్ పరిచయ వేదిక కార్యక్రమం

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండల కేంద్రంగా జనసేన పార్టీలో నూతనంగా చేరిన గిరిజన నేత మాజీ జెడ్పిటిసి నిమ్మల నిబ్రమ్ పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ర్యాలీగా వెళ్లి తనకి తాను పరిచయం చేసుకుంటూ జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. నడిమికెళ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా విక్రంపురం సరస్వతి దేవి ఆలయాన్ని సందర్శించి, అక్కడ నుంచి నేరుగా వీరఘట్టం అంబేద్కర్ జంక్షన్ వద్దకు వచ్చి జనసైనికులను, ప్రజలను ఉద్దేశించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు తనకు నచ్చి ఈ పార్టీలో చేరానని, గడపగడపకు జనసేన సిద్ధాంతాలు అనేవి చేరేలా చూస్తానని, జనసైనికుడిలా పాలకొండ నియోజకవర్గంలో పనిచేసి ఇరు పార్టీలకు దీటుగా ఉండే విధంగా జనసేన పార్టీని తీర్చిదిద్దుతానని ఈ సభ వేదికగా ప్రజలను ఉద్దేశించి నిమ్మల నిబ్రమ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాలుగు మండలాల జనసేన నాయుకులు జనసైనికులు పాల్గొన్నారు.