సర్వేపల్లిలో అభివృద్ధి శూన్యం..!

నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి గ్రామంలో శ్మశాన వాటికకు పోయే దారి అస్తవ్యస్తంగా ఉంది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా వాళ్లు స్పందించడం లేదు. వర్షాకాలంలో శవాన్ని తీసుకు వెళ్లి దహన సంస్కారాలు చేయాలంటే నీళ్ళలోనే గుంత తీసి వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి పట్టదా ఎన్నిసార్లు మండల అధికారులకు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు మరి దీనికి కారణాలు అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అభివృద్ధి చేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు మరి సర్వేపల్లిలో ఎక్కడ అభివృద్ధి. ఇకనైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటికకు పోయేదారిని బాగుచెయ్యాలని లేదంటే కలెక్టర్ కార్యాలయం నందు నిరసన చేస్తామని హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, రవికుమార్, సందీప్, వంశీ, సాయి, శ్రీహరి, గిరీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.