చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు ఆధారాలు లేవు: గంగారపు రామదాస్

మదనపల్లి నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తీరును నిరసిస్తూ మదనపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ లో డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి టిడిపి, జనసేన పార్టీల నాయకులు పూలమాలలు వేసి వినతిపత్రం అందజేసారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు ఏమాత్రం ఆధారాలు లేకుండా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం బాధకరం అని, అంబేద్కర్ రచించిన రాజ్యాన్ని పక్కన పెట్టి తాత రాజారెడ్డి రాజ్యాన్ని అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఓట్ల రూపంలో బుద్ది చెబుతారని, గంగా నది ఎక్కడ పుట్టిందో తెలియని అధికారులచే చంద్ర బాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టించిన సీఎం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. నారా లోకేష్ ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ‌ సిఎం ‌చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి ప్రజల చూపు మళ్ళీంచి దొంగ ఓట్లు చేర్చడం, టిడిపి, జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే పనిలో వైసిపి ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లె టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, పురం నగేష్, అర్జున, మోహన కృష్ణ, రెడ్డెమ్మ, స్వాతి, కొలిమి ప్రసాద్, కుమార్, శేఖర, లవన్న, శంకర మరియు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జూనైద్ అక్బరీ, టిడిపి నాయకులు బాలు స్వామి, నాగుర్ వల్లి, నవీన్ చౌదరి, బాలు పవర్ స్టార్ట్, హరి బాబు, హసీనా పాల్గొన్నారు.